కవి, పరిశోధకుడు, విమర్శకుడు డాక్టర్ టి.శ్రీరంగస్వామి వెలువరించిన సాహిత్య వ్యాస సంపుటి ‘పలుకుజెలి’. తన పలుకులకు చెలి సరస్వతి అని చెబుతూ, ఆమె అనుగ్రహాన్ని ఆశిస్తూ ఈ శీర్షికను ఎంచుకున్నారు. ఇందులో 16 వ్యాసాలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం. తెలంగాణలో స్వాతంత్య్రోద్యమ సాహిత్య వాతావరణం ఎలా ఉందో మొదటి వ్యాసంలోనే కండ్లకుకట్టారు. కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు మొదలైన వారి భాషా సాహిత్య కృషి, గడియారం రామకృష్ణశర్మ, దాశరథి, వేముగంటి మొదలైన మహాకవుల కవితాధార తెలంగాణ నేలను ఎలా జాగృతపరిచిందో, తెలంగాణ ఖ్యాతిని ఎలా విశ్వవ్యాప్తం చేసిందో చాటిచెప్పారు. ‘తొలి తెలంగాణ సాహిత్య దీపిక’ వ్యాసంలో తెలంగాణ సాహిత్య చరిత్రకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం తొలిదశలో వెలువడలేదని చెప్పారు.
సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’, సుంకిరెడ్డి ‘ముంగిలి’, ఎస్వీ రామారావు ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ మొదలైన గ్రంథాలు మన సాహిత్య చరిత్రను మరింత విస్తృతంగా పరిశోధించడానికి ఉపయోగపడతాయని వివరించారు. ‘నిత్యసాహితీ వసంతుడు నిత్యానందుడు’ వ్యాసంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు సాహిత్య కృషిని లోతుగా వివరించారు. ఇవే కాకుండా తెలుగు సాహిత్యం-లక్షణకర్తలు, తెలంగాణ శతక సాహిత్యం-పల్లేరు పరిశోధన, తొలి మహిళా పదకోశ కర్త- ముదిగంటి సుజాతారెడ్డి, భర్తృహరి వైరాగ్యశతి మొదలైన లోతైన వ్యాసాలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. యువ పరిశోధకులకు కరదీపిక ఈ ‘పలుకుజెలి’.
రచన: టి. శ్రీరంగస్వామి
పేజీలు: 104, ధర: రూ. 100
ప్రచురణ: శ్రీలేఖ సాహితి
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 200
ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 98487 87284
రచన: ఈతకోట సుబ్బారావు
పేజీలు:126
ధర: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 94405 29785
రచన: రాపోలు
సీతారామరాజు
పేజీలు:160, ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 98487 87284
-డా. తిరునగరి శరత్చంద్ర