సంతృప్తికరమైన జీవనానికి కావలసినవి.. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం. రెండిటినీ ఒకేచోట అందిస్తున్నది ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న మహాముద్ర రెస్టారెంట్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, రోడ్ నం.27లో ఉందీ రెస్టారెంట్. ఇక్కడ ప్రతి పదార్థాన్నీ ఆర్గానిక్ దినుసులతో వండుతారు. చక్కని వాతావరణమూ ఉంటుంది. ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ బోధనలు, వాటి విశ్లేషణలతో కూడిన చిత్రాలు రెస్టారెంట్ గోడలపై దర్శనమిస్తాయి.
సలాడ్స్, సూప్స్తోపాటు రకరకాల వడలు, దోశలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి. దేనికదే అద్భుతం. పోషకాలు పుష్కలం, రుచులు అమోఘం.. అనాల్సిందే. సంక్రాంతి, ఓనమ్, నవరాత్రి, ఉగాది తదితర ప్రత్యేక సందర్భాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంది మహాముద్ర. ‘భోజనం తపస్సు లాంటిది. ఏకాగ్రతతో తినాలి. ప్రశాంత వాతావరణంలో విందు ఆరగించాలి. అప్పుడే ఆ రుచులు మనసును తాకుతాయి. పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి’ అంటారు సద్గురు.