వర్షకాలంలో తలెత్తే గొంతు సమస్యలకు మసాలా టీ తిరుగులేని ఔషధంగా పనిచేస్తుంది. శొంఠి, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు తదితర మసాలా దినుసులతో ఈ చాయ్ని ఆస్వాదించవచ్చు. శొంఠి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా ఉంటుంది. కఫం, జీర్ణ సంబంధ సమస్యలకూ ఇది చెక్ పెడుతుంది. తులసి, నిమ్మరసం కలిపిన టీలో ఔషధ గుణాలు పుష్కలం. ఈ టీ తాగితే జలుబు, దగ్గు, గొంతులో గరగర మొదలైన ఇన్ఫెక్షన్లు దరిచేరవు. మలేరియా, డెంగ్యూ బారినపడకుండా ఉంటారు.