జవహర్నగర్, కీసర, ఏప్రిల్ 18: సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరికి సీఎం సహాయనిధి చెక్కులను 6వ డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి ఆధ్వర్యంలో బాధితులకు ఆదివారం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలోని పాత గబ్బిలాల పేటకు చెందిన ఎస్. లక్ష్మికి రూ. 60వేలు, నరేశ్కు రూ. 60 వేల చొప్పున చెక్కులు మంజూరయ్యాయి. అలాగే కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సునీతకు రూ.42వేలు, కీసరకు చెందిన ఎం.నవీన్కుమార్కు రూ.40వేలు, శ్రీనివాస్కు రూ.40 వేలు, కర్రె నర్సింహకు రూ.22 వేల చొప్పున సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ, ఎంపీటీసీ కవిత , ఉప సర్పంచ్ మహేశ్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.