ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో… క్యాన్సర్ది ఆరో స్థానం. ఒక్కో ఏడాది గడిచేకొద్దీ క్యాన్సర్ మరణాలూ పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ను తొలిదశలో గుర్తించలేకపోతే, అది ప్రాణాంతకంగా మారుతుంది. ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగా, మానసికంగా కూడా రోగుల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక, ఆ మహమ్మారిని అరికట్టే ఉపాయం తెలిసిపోయిందని అంటున్నారు పరిశోధకులు. పండ్ల మీద వాలే ఈగల్లో క్యాన్సర్ తీరును గమనించినప్పుడు… ఇంటర్ల్యూకిన్-6 అనే రసాయనం వల్లే క్యాన్సర్ మరణానికి దారితీస్తున్నట్టు తెలిసింది. ఈ రసాయనం మెదడుకూ, రక్త ప్రసారానికీ మధ్య వారధిని నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ల నుంచి పక్షవాతం వరకూ రకరకాల సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఎలుకల్లోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. అంతేకాదు, ఇంటర్ల్యూకిన్-6 రసాయనాన్ని సమర్థంగా అడ్డుకున్నప్పుడు ఎలుకల్లోను, ఈగల్లోనూ జీవితకాలం మెరుగైనట్టు గమనించారు. ఇప్పుడు, ఇదే తరహా చికిత్స ద్వారా
మనుషుల్లోనూ క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నారు.