యుగయుగాల చరిత్రలో స్త్రీజాతిపై ధరిత్రి పగబట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ మకిలిని తమ రచనలతో శుద్ధి చేసిన పురుష రచయితలు ఎందరెందరో ఉన్నారు. ఆ దిశగా ఆధునిక రచయితలు కొందరు ఎంతో కృషి చేశారు. గురజాడ అప్పారావు, చలం, కొడవటిగంటి కుటుంబరావు తదితర రచయితలు తమ రచనల్లో స్త్రీస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఆ తర్వాతి తరంలోనూ కొందరు కవులు ఇంతి పక్షం వహించినా నేటికీ సాహితీ లోకంలో స్త్రీ రెండో కథా వస్తువే! ఆర్థిక విజయం కోసమో, పాఠక ఆదరణ కోసమో మహిళల చుట్టూ కథలు అల్లారు కానీ, నిజాయతీగా పాటుపడిన వారు తక్కువ. చిత్తశుద్ధితో స్త్రీ వాదాన్ని బలంగా వినిపించిన అభ్యుదయ పురుష రచయితల ప్రయత్నాన్ని నలుగురికీ చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా ‘స్త్రీ వాదం-పురుష రచయితలు’ అంశంపై పరిశోధనా గ్రంథం ఆవిష్కరించారు రచయిత్రి డాక్టర్ సీహెచ్ సుశీలమ్మ. నాటి గురజాడ నుంచి నేటి సలీం వరకు కవిత్వంలో, కథల్లో, నవలల్లో, నాటకాల్లో స్త్రీ ఔచిత్యాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన విధానాన్ని పరిశోధనాత్మకంగా ఇందులో పొందుపరిచారు.
ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుష రచయితలు
రచయిత్రి: డా॥ సీహెచ్ సుశీలమ్మ
పేజీలు: 192, వెల: రూ.150
ప్రతులకు: 214, నారాయణాద్రి
ఎస్వీఆర్ఎస్ బృందావనం
సరూర్నగర్, హైదరాబాద్ – 500035