కార్పొరేట్ ప్రపంచంలో మార్పు మినహా ఏదీ శాశ్వతం కాదు. వ్యూహాలు, సాంకేతికత, మార్కెట్ తీరుతెన్నులు, దలాల్ స్ట్రీట్ ఎత్తుపల్లాలు.. మారుతూనే ఉంటాయి. ఆ కొత్తను అర్థం చేసుకోవడంలో, తమ సంస్థకు అన్వయించడంలో పురుష కార్పొరేట్లతో పోలిస్తే.. మహిళా సీఈవోలే ముందుంటారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎమెరిటస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న పదిహేడువందల మందిలో.. ఎనభై ఏడు శాతం మహిళలు మార్పును ఇష్టపడతామని చెప్పారు. అందుకు అవసరమైన చదువుల కోసం.. రూ. పది లక్షలకు పైగా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అదే పురుషులు ఏడెనిమిది లక్షల వద్దే ఆగిపోయారట. పురుష కార్పొరేట్ నిపుణులు శిక్షణ కోసం మూడు నెలల సమయం కేటాయిస్తామని చెప్పగా, మహిళలు ఆరు నెలలైనా ఫర్వాలేదన్నారు.