HomeSuccess-storyKrishnaveni Performed Liver Transplantation For A Sick Child
కష్టజీవుల.. కృష్ణమ్మ
కరీంనగర్ జిల్లా చిగురు మామిడికి చెందిన లావణ్యకు పండంటి బాబు పుట్టాడు. ఒకరోజు ఇంట్లో వంట చేస్తూ ఏదో పని మీద పక్కకు వెళ్లింది లావణ్య. ఆడుకుంటూ అటుగా వచ్చిన పసివాడు పొయ్యి మీది కడాయిని లాగేశాడు. దీంతో మొఖం మీద నూనె పడి.. తీవ్ర గాయాలయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓ నిరుపేద వృద్ధురాలు వానొస్తే కూలిపోయే గుడిసెలో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నది. తినడానికి పిడికెడు గింజలూ కరువే. ఆమె గురించి తెలుసుకున్న కృష్ణవేణి ఆ గుడిసెలోకి వెళ్లింది. వయోధికురాలిని పలకరించింది. నెలకు సరిపడా సరుకులు అందించింది. గుడిసె స్థానంలో రేకుల ఇల్లు నిర్మించి ఇచ్చింది. ఆమె మంచితనానికి ఇదో సాక్ష్యం.
కరీంనగర్ జిల్లా చిగురు మామిడికి చెందిన లావణ్యకు పండంటి బాబు పుట్టాడు. ఒకరోజు ఇంట్లో వంట చేస్తూ ఏదో పని మీద పక్కకు వెళ్లింది లావణ్య. ఆడుకుంటూ అటుగా వచ్చిన పసివాడు పొయ్యి మీది కడాయిని లాగేశాడు. దీంతో మొఖం మీద నూనె పడి.. తీవ్ర గాయాలయ్యాయి. ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ హాస్పిటల్కు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న కృష్ణవేణి పసిబిడ్డ చికిత్స బాధ్యత తీసుకుంది.
జగిత్యాలకు చెందిన ఆరేండ్ల కౌశిక్ తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. బిడ్డకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్లు. కౌశిక్ తల్లిదండ్రులకు అంత స్తోమత లేదు. దీంతో సాయం అర్థిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అది చూసిన కృష్ణవేణి దంపతులు పరుగున హాస్పిటల్కి వెళ్లి కౌశిక్ తల్లి లక్ష్మిని ఓదార్చారు. తమ వంతు సాయంగా కొంత డబ్బు ఇచ్చారు. మరికొందరి చొరవతో కౌశిక్కు ఆపరేషన్ చేయించారు. ఇలా.. కృష్ణవేణి నుంచి సాయమందుకున్న చేతులు చాలానే ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కృష్ణవేణికి చిన్నప్పటి నుంచీ సేవాభావం ఎక్కువ. తండ్రి ఉపాధ్యాయుడు. తన పిల్లలకు చదువుతోపాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండటం నేర్పాడు. అందుకే, ఎల్ఎల్బీ చదివినా.. సంపాదన గురించి ఆలోచించకుండా సేవకే పరిమితం అయ్యారామె. భర్త కొత్త శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి. నేనున్నానంటూ తోడుగా నిలిచారు. కాబట్టే, గత ఇరవై ఏండ్లుగా సమాజ సేవలో మునిగిపోయారామె.
వేసవిలో మండే ఎండల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు,రిక్షా శ్రామికులకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందిస్తారు. డీహైడ్రేషన్ రాకుండా.. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచుతారు. మురికివాడలు, బస్తీల్లో తిరుగుతూ అక్కడి పేద పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పండ్లు పంపిణీ చేస్తారు. వానాకాలం గుడిసెల మీద కప్పేందుకు టార్పాలిన్ కవర్లు, దోమల బాధ లేకుండా.. దోమతెరలు ఇస్తారు. కృష్ణవేణి తపనను గుర్తించి పలు సంస్థలు సన్మానించాయి. ‘నిజానికి, పేదల చిరునవ్వులే నాకు అవార్డులు’ అంటారామె.