టీచర్…ఉపాధ్యాయ కొలువు అంటే నోబుల్ ప్రొఫెషన్. ఈ పోస్టులో పొందినంత సంతృప్తి మరే వృత్తిలో లభించదని అంటారు పెద్దలు. విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, నాయకుడిగా, బిజినెస్ మ్యాన్గా తయారుచేసి సమాజానికి అందించే అరుదైన అవకాశం కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇలాంటి వృత్తిలో ప్రవేశించడానికి రకరకాల పరీక్షలు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇంటర్/డిగ్రీ తర్వాత ఎంట్రన్స్ రాసి డీఈడీ/బీఈడీ చేయాలి. తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించాలి. తర్వాత టీఆర్టీ/డీఎస్సీలో సాధించిన మార్కుల ఆధారంగా టెట్ స్కోర్ కలిపి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపిక చేస్తారు. డీఈడీ/బీఈడీ చేసిన అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒక అవకాశం. ప్రస్తుతం టెట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం..
ముఖ్య తేదీలు
అర్హత మార్కులు..
జనరల్ – 60 శాతం, బీసీ-50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ -40 శాతం మార్కులు సాధిస్తే టెట్లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు.
వ్యాలిడిటీ..
టెట్లో అర్హత సాధించిన వారికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది.
టెట్ మార్కులకు వెయిటేజీ
టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో టెట్లో సాధించిన స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
పేపర్-II పరీక్ష విధానం
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
పిల్లల ఉచిత, నిర్బంధ విద్య (ఆర్టీఈ)-2009 చట్టంలో సబ్ సెక్షన్ (1) ఆఫ్ సెక్షన్ 23 ప్రకారం ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేయాలంటే టెట్లో అర్హత తప్పనిసరి అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) స్పష్టం చేసింది.
టెట్లో పేపర్-I, పేపర్-II ఉంటాయి.
టెట్ పేపర్-I
టెట్ పేపర్-II