రాజన్న సిరిసిల్ల, జూన్ 17 (నమస్తే తెలంగా ణ): వస్త్ర పరిశ్రమలో సాంచాలు నడిపే కామ్గార్ల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రూ.వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్ల తో ఒకవైపు పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తూనే మరో వైపు చితికిన కార్మికుల బతుకుల్లో వె లుగులు నింపుతున్నది. బతుకమ్మ కానుకగా ఆడబిడ్డలకు అందిస్తున్న బతుకమ్మ చీరల తయారీకి వినియోగించే నూలును ఉత్పత్తి దారులకు సబ్సిడీపై అందిస్తుండగా, అందులో 10శాతం సబ్సిడీని కార్మికుడికి బోనస్గా చెల్లిస్తూ వారి బతుకుల కు భరోసా కల్పించింది.
చీరల ఉత్పత్తి ద్వారా పరిశ్రమను నడిపిస్తున్న యజమానులు, ఆసాములతో పాటు కార్మికుల కష్టాలు గట్టెక్కాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూపిన చొరవతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా సంపాదిస్తున్నాడు. ప్రభుత్వం అందించిన సాయంతో పట్టణంతో పాటు టెక్స్టైల్స్ పార్కులో మొత్తం 35వేల మరమగ్గాలపై పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
విడుతల వారీగా సబ్సిడీ
కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సి రిసిల్ల కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్టు, చేనేతలక్ష్మీ, వర్కర్ టూ ఓనర్, నేతన్నకు బీమా, మరమగ్గాల ఆధునీకరణ, యార్న్ సబ్సిడీ లాంటి సంక్షే మ పథకాలు ప్రవేశపెట్టింది. 12 గంటల పాటు రాత్పైలీ, దిన్పైలీ చేస్తున్న కార్మికుల దయనీయ పరిస్థితికి చలించిన మంత్రి రామన్న ఆసరా పిం ఛన్ల వయో పరిమితి 50 ఏండ్లకు తగ్గించారు. వారి కుటుంబాలలో బీడీలు చుట్టే మహిళలకు, కార్మికుడికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నా రు. అంతే కాకుండా బతుకమ్మ చీరలకు వినియోగించే యార్న్లో 10 శాతం సబ్సిడీని కార్మికుడికి బోనస్గా అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి 2018లో ఈ పథకం అమలు చేశారు. 2018, 2019 సంవత్సరానికి రూ.18 కోట్లు విడుదల చేయించారు. సిరిసిల్ల పట్టణంలో 132 మాక్స్ సంఘాలు, 121 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు (ఎస్ఎస్ఐ) యూనిట్లు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 15 మంది ఆసాములు ఉండగా, ఎస్ఎస్ఐ యూనిట్లలో యజమానులున్నారు. వీరి వద్ద కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడి నుంచి వివరాలు తీసుకుని బ్యాంకుల్లో ఖాతాలు తీయించారు. 2019 సంవత్సరానికి సంబంధించి మొదటి విడుతలో 635 మంది కార్మికులకు 103.68 లక్షలు విడుదల చేయగా, రెండో విడుత శుక్రవారం 534 మందికి రూ.89.50లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
నేరుగా కార్మికుడి ఖాతాల్లోకి పైసలు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న యార్న్ స బ్సిడీ నిధులు నేరుగా కార్మికుడి బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకు న్నారు. జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులు కార్మికులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, వారు ఉ త్పత్తి చేసిన వస్త్ర మీటర్ల ఆధారంగా పదిశాతం సబ్సిడీ పైసలను టెస్క్ సంస్థ వారి బ్యాంకు ఖాతా ల్లో జమచేస్తున్నది. కార్మికుడికి న్యాయంగా అం దాల్సిన బోనస్ పైసలు ఎలాంటి తేడా రాకుండా చెల్లిస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ద్వా రా ఒక్కో మరమగ్గాల కార్మికుడు రూ.16వేల నుంచి రూ.30వేల దాకా లబ్ధిపొందుతున్నట్లు అ ధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నందున ఇతర ప్రాంతాల నుంచి సిరిసిల్లకు కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున వలస వస్తున్నాయి.
ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం..
మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న నూలు సబ్సిడీ డబ్బులు నేరుగా వారీ ఖాతాల్లోనే జమవుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల సబ్సిడీ నిధులు సకాలంలో విడుదలవుతున్నాయి. కార్మికుల వివరాలు ఆన్లైన్లో చే రుస్తున్నాం. సబ్సిడీ పైసలు ప్రతి కార్మికుడికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
– సాగర్, చేనేత జౌళీశాఖ అధికారి,రాజన్న సిరిసిల్ల