PCB : వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. వీదేశీ కోచ్లను తొలగిండచడం, సెలెక్టన్ కమిటీ సభ్యుల ఎంపికపై వివాదం మరువక ముందే.. మరో షాకింగ్ న్యూస్.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చైర్మన్ జకా అష్రఫ్(Zaka Ashraf) రాజీనామా చేశాడు. పదవి చేపట్టి ఏడాది కాకముందే పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. బోర్డుఅధ్యక్షుడిగా అష్రఫ్ పనితీరుపై కొందరు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
‘పాక్ క్రికెట్ను వృద్ధిలోకి తెద్దామనుకున్నా. కానీ, ఆ విధంగా పని చేయడం నాకు సాధ్యం కాలేదు. నా స్థానంలో ఎవరిని నామినేట్ చేయాలనేది ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హక్ కకార్(Anwar Ul Haq Kakar) నిర్ణయం తీసుకుంటారు’ అని అష్రఫ్ తెలిపాడు.
#ICYMI: Zaka Ashraf has resigned as the chairman of the Interim Management Committee (IMC), the body heading the PCB
Full story 👉 https://t.co/iyaYHxn9Ji pic.twitter.com/ZCKqcX2ssn
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2024
గడిచిన రెండేండ్ల కాలంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు అధ్యక్షులు మారారు. రమిజ్ రజా(Ramij Raza) తర్వాత నజం సేథీ(Najam Sethi) చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే.. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ కాలం ముగిశాక కొత్తగా ఎన్నికైన ప్రధాని అష్రఫ్ను నామినేట్ చేశాడు. 2023 జూలైలో అతడి ఆధ్వర్యంలో పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడింది.
జకా అష్రఫ్
అష్రఫ్ పీసీబీ హెడ్గా ఉన్న కాలంలో పాకిస్థాన్ జట్టు రెండు ఐసీసీ టోర్నీల్లో ఆడింది. ఆసియా కప్తో పాటు వన్డే వరల్డ్ కప్లో ఫైనల్కు చేరలేకపోయింది. దాంతో, పాక్ జట్టు ఎంపికపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ కప్లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్గా వైదొలిగాడు.
అనంతరం షాన్ మసూద్కు టెస్టు, వన్డే పగ్గాలు.. స్పీడ్స్టర్ షాహీన్ ఆఫ్రిదికి టీ20 సారథ్యం అప్పగించింది. కెప్టెన్లు మారినా కూడా పాక్ జట్టు రాత మారలేదు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడమే కాకుండా.. న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను కోల్పోయింది.