Yuvraj Singh : భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) మైదానంలోకి దిగాడంటే సిక్సర్ల సునామే. ధనాధన్ ఇన్నింగ్స్లతో భారత జట్టు గొప్ప విజయాలు అందించిన యూవీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ(Member Of Parliament)గా యువరాజ్ సింగ్ పోటీ చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి యూవీ పోటీ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకో తెలుసా..?
తాజాగా యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని కలిశాడు. దాంతో, అతడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం మనదేశంలో కొత్తేమీ కాదు. మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు.
యువరాజ్ సింగ్, స్టువార్ట్ బ్రాడ్
అయితే..మెడియస్టినల్ సెమినోమా(mediastinal seminoma) అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యూవీ.. అమెరికాలోని బోస్టన్లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ మహమ్మారి నుంచి 2012లో బయటపడిన అతడు మళ్లీ మైదానంలో ఫ్యాన్స్ను అలరించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్లో ఆడుతున్న అతడు న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు.