ఢిల్లీ: భారత దిగ్గజ సారథులు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీకి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఈ ఇద్దరినీ ఉద్దేశిస్తూ యువీ తండ్రి యోగ్రాజ్ గతంలో పదేపదే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను తాజాగా అతడు స్పందించాడు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. ‘నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా’ అని అన్నాడు.
భారత జట్టులో చోటు కోల్పోవడానికి ధోనీనే కారణమని యోగ్రాజ్ గతంలో ఆరోపించేవాడు. అంతేగాక 1980ల్లో తన క్రికెట్ కెరీర్ను నాశనం చేస్తానని కపిల్దేవ్ బెదిరించాడనీ వాపోయాడు. ఈ వ్యాఖ్యలపై ఇన్నాళ్లూ స్పందించని యువీ తాజాగా.. ‘ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మా నాన్నకు చెబుతూనే ఉంటా’ అని తెలిపాడు.