న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.
మంగళవారం జరిగిన వేర్వేరు బౌట్లలో నలుగురు భారత మహిళా బాక్సర్లు ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ముందంజ వేశారు.