ఢిల్లీ: వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్ తన్వి శర్మ సెమీఫైనల్స్కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో టాప్ సీడ్ తన్వి 21-18, 15-21, 21-14తో మరో భారత ప్లేయర్ మాళవిక బన్సోద్ను ఓడించిన ఆమె సెమీస్కు క్వాలిఫై అయింది. మూడో సీడ్ ఇషారాణి బరూహ్.. 21-15, 21-18తో హువాంగ్ చింగ్ పింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి లాస్ట్-4కు చేరింది.
సెమీస్లో ఆమె భారత్కే చెందిన రక్షిత శ్రీతో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్.. 28-26, 21-12తో సహచర షట్లర్ సరస్వత్ను ఓడించి సెమీస్కు చేరాడు.