తాష్కెంట్ : ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ బెర్త్పై తెలంగాణ యువ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కన్నేశాడు. శుక్రవారం జరిగే సెమీస్లో విజయం సాధించి స్వర్ణ పోరుకు చేరుకోవాలని ఉరకలు వేస్తున్నాడు. హుసామ్తోపాటు దీపక్ బోరియా, నిశాంత్ దేవ్కూడా ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్కు చేరుకోవాలని ఆశిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్కు తొలి అర్హత దశ అయిన ఈ టోర్నీలో పతక సాధనతో లక్ష్యం చేరుకోవాలని భారత బాక్సర్లు భావిస్తున్నారు. సెమీస్లో హుసాముద్దీన్ క్యూబాకు చెందిన సైదల్తో తలపడనున్నారు.