న్య్యూఢిల్లీ: యువ అథ్లెట్ జ్యోతి యెర్రాజి కెరీర్ రెండో అత్యుత్తమ ప్రదర్శనతో జర్మనీ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజ్ లెవల్ గాలా ఈవెంట్లో 23 ఏండ్ల తెలుగమ్మాయి 12.84 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది.
నిరుడు 12.82 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పిన జ్యోతికి ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. పురుషుల 200 మీటర్ల రేస్లో అమ్లన్ బొర్గోహై 20.66 టైమింగ్తో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.