షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో యువ ఆర్చర్లు సిమ్రన్జీత్ కౌర్, సాహిల్ జాదవ్ పతక రేసులోకి వచ్చారు. శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్లో సిమ్రన్జీత్.. 6-0తో చైనీస్ తైపీకి చెందిన ఫొంగ్ యు ఝును చిత్తుగా ఓడించి సెమీస్ చేరింది. ఆదివారం జరిగే సెమీస్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ చెయాంగ్ (కొరియా)తో తలపడనుంది.
భారత్ భారీ ఆశలు పెట్టుకున్న కాంపౌండ్ విభాగంలో టాప్ ఆర్చర్లంతా విఫలమైనప్పటికీ సాహిల్ జాదవ్ మాత్రం సత్తాచాటాడు. క్వార్టర్స్లో సాహిల్.. ఆస్ట్రియాకు చెందిన నికో వీనర్ను షూటాఫ్లో ఓడించి సెమీస్కు అర్హత సాధించాడు. ఇద్దరు 147 పాయింట్లు స్కోరు చేయగా షూటాఫ్లో సాహిల్ 10-9తో ప్రత్యర్థిని ఓడించి పతక రేసులో నిలిచాడు.