Sachin Tendulkar : టీమిండియా మాజీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుత్రోత్సాహంలో ఉన్నాడు. అతని కుమారుడు అర్జున్ గోవా జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. అర్జున్ శతకం చేయడం పట్ల సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మొదటి రోజున తనకు, అర్జున్కు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు. ‘సెంచరీ కోసం ప్రయత్నించు. నువ్వు శతకం సాధించగలనని నమ్ముతున్నావా?’ అని అర్జున్తో అన్నాడట. అంతేకాదు అర్జున్ చిన్నప్పటి రోజులను కూడా సచిన్ గుర్తు చేసుకున్నాడు. ‘అర్జున్ అందరిలా బాల్యాన్ని ఎంజాయ్ చేయలేదు. క్రికెటర్ కుమారుడు కావడంతో అతను కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వచ్చేది. చిన్నవయసులో అది నిజంగా చాలా కష్టం. అందుకనే నేను రిటైర్మెంట్ అయిన రోజు ముంబైలో మీడియాతో అర్జున్ను క్రికెట్తో ప్రేమలో పడనివ్వండి’ అని చెప్పాను అని సచిన్ తెలిపాడు.
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో అర్జున్ మొదటి రోజు నైట్ వాచ్మెన్గా వచ్చాడు. 4 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తండ్రి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని రెండో రోజు అతను సెంచరీ బాదాడు. 207 బంతుల్లో 120 రన్స్ చేశాడు. అతని సెంచరీ చేయడంతో గోవా 9 వికెట్లకు 547 పరుగులు చేసింది. ముంబై జట్టు తరఫున రంజీల్లో ఆడే అవకాశం రాకపోడంతో ఈ ఏడాది మొదట్లో అర్జున్ గోవాకు వచ్చాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా తుది జట్టులో చోటు సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడాలనే కలను నెరవేర్చకున్నాడు.