న్యూఢిల్లీ: గుజరాత్ వేదికగా సెప్టెంబర్లో మొదలయ్యే జాతీయ క్రీడల్లో ప్రాచీన విద్యగా పేరొందిన యోగా, మల్కాంబ్కు చోటు దక్కింది. ఇప్పటికే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వీటిని ప్రవేశపెట్టగా, తాజాగా 36వ జాతీయ క్రీడల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.
దేశంలోని 28 రాష్ర్టాలతో పాటు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 36 క్రీడా విభాగాల్లో ప్లేయర్లు పోటీపడుతారని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ)బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘స్పోర్ట్స్ ఫర్ యూనిటీ’ థీమ్గా గుజరాత్లోని ఆరు నగరాల్లో జాతీయ క్రీడలు జరుగబోతున్నాయి.