హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్ సాగర్ వేదికగా వైఏఐ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం జరిగిన అండర్-15 టీమ్ ఈవెంట్లో మధ్యప్రదేశ్కు చెందిన ఎన్ఎస్ఎస్ భోపాల్ పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఏకలవ్య బాతమ్..ఎన్ఎస్ఎస్ భోపాల్ టీమ్ను అగ్రస్థానంలో నిలుపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఓవైపు విరామం లేని వర్షంతో నగరంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా..సెయిలర్లు తమదైన పోరాట పటిమ ప్రదర్శించారు.