WTC 2023-25 Points Table: ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో నాలుగో రోజు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ టెస్టులో ఓటమితో ఐదో స్థానానికి పడిపోయిన భారత్.. పదిరోజులు తిరక్కముందే మళ్లీ రెండో స్థానానికి చేరింది. డబ్ల్యూటీసీ 2023-25 స్టాండింగ్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్లో ఓడటంతో భారత్ ఐదో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.
వైజాగ్ టెస్టు విజయంతో భారత్ ఈ డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో ఆరు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి రెండింటిలో ఓడి ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా భారత్.. 52.77 పర్సంటేజ్తో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆసీస్.. పది మ్యాచ్లు ఆడి ఆరింటిలో విజయాలు సాధించి మూడు ఓడిపోయి ఒకటి డ్రా చేసుకుంది. ఆ జట్టు 55 పర్సంటేజ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లండ్.. 8వ స్థానంలో ఉండటం గమనార్హం. ఈ సైకిల్లో ఇంగ్లండ్.. ఏడు టెస్టులు ఆడి మూడు గెలిచి మూడింటిలో ఓడి ఒకటి డ్రా చేసుకుంది. ఆ జట్టు 25 పర్సంటేజ్తో ఉంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి జట్లతో కంటే ఇంగ్లండ్ కింద ఉండటం గమనార్హం.
India back in Top 2. 🇮🇳
– The dream for WTC 2025 is on. pic.twitter.com/3N7sUDbIJD
— Johns. (@CricCrazyJohns) February 5, 2024
డబ్ల్యూటీసీ 2023-25 స్టాండింగ్స్ జాబితా
– ఆస్ట్రేలియా : 55
– ఇండియా : 52.77
– సౌతాఫ్రికా : 50
– న్యూజిలాండ్ : 50
– బంగ్లాదేశ్ : 50
– పాకిస్తాన్ : 36.66
– వెస్టిండీస్ : 33.33
– ఇంగ్లండ్ : 25
– శ్రీలంక : 0