WFI | లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసెడింట్ బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాలని కోరుతూ వినేష్ ఫోగట్ సహా ఏడుగురు టాప్ రెజర్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
లైంగిక వేధింపులపై మహిళ రెజర్లు బ్రిజ్ భూషణ్ సింగ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా కేసు నమోదు కాలేదని, పోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ మళ్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా రెజ్లర్లు, బ్రిజ్ భూషణ్ సింగ్ దాదాపు మూడు నెలలుగా వివాదం కొనసాగుతున్నది. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్లతో సహా రెజ్లర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్పై ఢిల్లీ పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని వినేశ్ ఓ ట్వీట్లో తెలిపింది.
జనవరిలో ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ క్రీడాకారులను లైంగిక వేధించారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీనియర్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, మేరీకోమ్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాకపోవడం, రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.