WPL : మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులకు బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ దక్కించుకన్న కంపెనీకి ఐదేళ్ల కాలానికి (2023-2027) టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను కట్టబెట్టనుంది. ‘మహిళల ప్రీమియర్ లీగ్ 2023-2027 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బిడ్స్ను బీసీసీఐ ఆహ్వానిస్తోంది. బిడ్స్ వివరాలు, షరతులు, టెండర్ ప్రక్రియ, అర్హతలు వంటి వివరాలన్నీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (Request for Proposal’ (“RFP”))లో ఉంటాయి. రూ. లక్ష నాన్ రీఫండబుల్ ఫీజు, జీఎస్టీ కలిపి జమ చేసిన వాళ్లకు ఆర్పీఎఫ్ వివరాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి’ అని ట్విట్టర్లో పోస్ట్లో పేర్కొంది.
మర్చిలో డబ్ల్యూపీఎల్
మహిళల ప్రీమియర్ లీగ్ మార్చిలో ప్రారంభం కానుంది. దాంతో, ఈ మెగా టోర్నీకి బీసీసీఐ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈమధ్యే ఐదు ఫ్రాంఛైజీలు రూ.4669.99 కోట్ల భారీ ధరకు ఐదు జట్లను కొనుగోలు చేశాయి. అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, కాప్రి గ్లోబల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వేలంలో మహిళల ప్రీమియర్ జట్లను దక్కించుకున్నాయి. ఇప్పటికే వైకోమ్ సంస్థ ఐదేళ్లకు మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.
🚨 NEWS 🚨
BCCI announces the release of Request for Proposal for Title Sponsorship Rights for Women’s Premier League Seasons 2023-2027.
More details 👇 #WPLhttps://t.co/xmkKl4XWNt pic.twitter.com/eQOSn8GvMF
— BCCI (@BCCI) January 28, 2023