WPL 2024, MI vs DC | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందా..? లేదా..? అనేది నేడు తేలిపోనుంది. నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్ ఆడనుంది. నేటి మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ ఆశలు ఉండనున్నాయి. ఒకవేళ భారీ తేడాతో ఓడితే యూపీ, గుజరాత్లకూ అవకాశమిచ్చినట్టే అవుతుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ.. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్.. బ్యాటింగ్కు రానుంది.
పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానం (7 మ్యాచ్లు.. 5 విజయాలు.. 2 ఓటములు.. 10 పాయింట్లు) లో ఉండగా ఆర్సీబీ (7 మ్యాచ్లు.. 3 గెలుపు.. 4 పరాజయం.. 6 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. నేటి పోరులో ముంబై గెలిస్తే అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది. రేపు ఢిల్లీ – గుజరాత్ మ్యాచ్లో క్యాపిటల్స్ ఓడితే ముంబై నేరుగా ఫైనల్ ఆడుతుంది. లేదంటే మూడో స్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది.
ఆర్సీబీ విషయానికొస్తే.. టేబుల్లో మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఆ జట్టు గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడుతాయి. ఒకవేళ ఓడితే తక్కువ మార్జిన్తో ఉంటే యూపీ, గుజరాత్లకు ఛాన్స్ ఉండదు. అలాకాకుండా ముంబై చేతిలో 60 పరుగుల తేడాతో గనక ఆర్సీబీ ఓడితే అప్పుడు యూపీ, గుజరాత్లకు ఛాన్స్ ఉంటుంది. యూపీ ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడి మూడు గెలిచి ఆరు పాయింట్లతో ఉండగా గుజరాత్ ఏడింట్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది.