WPL 2024 | భారత్లో టీ20 లీగ్ల పండుగలో మొదట వచ్చే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కొద్దిసేపటి క్రితమే బాలీవుడ్ స్టార్స్ల ప్రత్యేక ఆకర్షణ మధ్య ప్రారంభ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇక తొలి మ్యాచ్లో గత సీజన్ ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్ (విన్నర్).. ఢిల్లీ క్యాపిటల్స్ (రన్నరప్)ను ఢీకొననుంది. తొలి మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
బీసీసీఐ గతేడాది ప్రారంభించిన మహిళల ప్రీమియర్ లీగ్.. తొలి సీజన్లో విజయవంతమైంది. తొలి సీజన్లో మాదిరిగానే రెండో సీజన్ కూడా విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నెల రోజుల పాటు జరిగే ఈ లీగ్లో తొలి అంచె పోటీలు బెంగళూరులో జరగాల్సి ఉండగా రెండో విడత మ్యాచ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి.
𝐁𝐞𝐚𝐮𝐭𝐲 🤩 #WPL2024 #CricketTwitter pic.twitter.com/P2KXX6oN27
— Female Cricket (@imfemalecricket) February 23, 2024
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), నటాలీ సీవర్ బ్రంట్ , యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, అమెలియా కెర్, అమన్జ్యోత్ కౌర్, ఎస్. సజన, పూజా వస్త్రకార్, షబ్నమ్ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యా్ప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్, అన్నాబెల్ సదర్లండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే