WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ మళ్లీ మొదటికొచ్చింది. టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులకే పరిమితమైంది. గత మూడు మ్యాచ్లలో చెలరేగి ఆడుతున్న గుజరాత్ టాపార్డర్.. నేటి మ్యాచ్లో విఫలమైంది. భారతి ఫుల్మలి (36 బంతుల్లో 42, 7 ఫోర్లు), క్యాథ్రిన్ బ్రైస్ (28)లు రాణించారు. ఢిల్లీ స్టార్ పేసర్ మరిజన్నె కాప్ (2-17) మరోసారి మెరిసింది. మిన్ను మణికి రెండు వికెట్లు (2/9) దక్కాయి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్.. తొలి ఓవర్లోనే కెప్టెన్ బెత్ మూనీ వికెట్ను కోల్పోయింది. ఐదు బంతులాడిన ఆమె.. పరుగులేమీ చేయకుండానే కాప్ బౌలింగ్లో బౌల్డ్ అయింది. మూడో ఓవర్లో కాప్.. లారా వోల్వార్డ్ట్ (7)ను ఔట్ చేసింది. మూడో స్థానంలో వచ్చిన దయాలన్ హేమలత (4)ను స్పిన్నర్ జొనాసెన్ బౌల్డ్ చేసింది. 5 ఓవర్లలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్కు వికెట్ల పతనం కొనసాగింది. ఫొబె లిచ్ఫీల్డ్ (21) , ఆష్లే గార్డ్నర్ (12)లు కూడా నిరాశపరిచారు.
Need early breakthroughs?
📞 Call Kapp #CricketTwitter #WPL2024 #DCvGG pic.twitter.com/YhtXSM4hJX
— Female Cricket (@imfemalecricket) March 13, 2024
48 రన్స్కు ఐదు వికెట్లు కోల్పోయిన గుజరాత్ను భారతి ఫుల్మెలి, క్యాథ్రీన్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 68 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆఖర్లో స్కోరువేగాన్ని పెంచే క్రమంలో భారతిని శిఖా పాండే ఔట్ చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తే ఢిల్లీ క్యాపిటల్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ ఆడే ఛాన్స్ దక్కించుకుంటుంది.