న్యూఢిల్లీ: స్పెయిన్లోని లా నుసియాలో జరుగుతున్న ఐబీఏ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు మూడు స్వర్ణాలతో మెరిశారు. శనివారం జరిగిన పురుషుల 48కిలోల ఫైనల్లో చెన్నైకు చెందిన విశ్వనాథ్ సురేష్.. రోనెల్ సుయోమ్(ఫిలిప్పీన్స్)ను ఓడించి భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అంతకుముందు జరిగిన తొలి పోరులో భావన శర్మ(48కి.), ఆశిష్(54కి.) ఇండియాకు రజతాలు సాధించిపెట్టారు.
భావన 0-5తో ఉజ్బెకిస్థాన్కు చెందిన గుల్సెవర్ గనీవా చేతిలో, ఆశిష్ 1-4తో జపాన్కు చెందిన యుటా సకాయ్ చేతిలో ఓడి రజతాలతో సంతృప్తి చెందారు. కాగా పుణెకు చెందిన దేవిక ఘోర్పడె(52కి.) ఇంగ్లండ్కు చెందిన లారెన్ మాకీని ఓడించి భారత్కు రెండో స్వర్ణం సాధించిపెట్టింది. పురుషుల 63.5 కిలోల విభాగంలో వంశజ్ మూడో స్వర్ణం అందించాడు. జార్జియాకు చెందిన దెమూర్ కజాయ్ను వంశజ్ 5-0తో ఓడించాడు. ఇండియా మొత్తం 11 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఉజ్బెకిస్థాన్(10) ఐర్లాండ్(7), కజకిస్థాన్(7) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.