హైదరాబాద్, ఆట ప్రతినిధి: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లోనూ పాకిస్థాన్ పరాజయం పాలైంది. మంగళవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.
గ్లెన్ మ్యాక్స్వెల్ (77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (50 నాటౌట్), ఇంగ్లిస్ (48) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 90 రిటైర్డ్ హర్ట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగగా.. ఇఫ్తిఖార్ (83), నవాజ్ (50) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్లో శ్రీంలకపై అఫ్గానిస్థాన్ 6 వికెట్లతో విజయం సాధించింది.