World Cup Final : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో భారత్(India), ఆస్ట్రేలియా (Australia) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనను ఆసీస్ 43 ఓవర్లలోనే పూర్తిచేసింది. ట్రావిస్ హెడ్ శతకంతో ఆ జట్టు ఆరోసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నెగ్గింది.
వరుసగా పది మ్యాచ్లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు నాసిరకమైన బౌలింగ్తో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనను ఆసీస్.. 43 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 58 నాటౌట్, 4 ఫోర్లు) రాణించి ఆ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఆసీస్.. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ను గెలుచుకుంది. పుష్కరకాలం తర్వాత స్వదేశంలో కప్పు గెలవాలన్న భారత కల మరోసారి చెదిరింది.
సెంచరీ తర్వాత ట్రావిస్ హెడ్ దంచికొడుతున్నాడు. సిరాజ్ వేసిన 37వ ఓవర్లో హెడ్.. సిక్సర్ బాదాడు. అంతకుముందు బంతికే లబూషేన్ సింగిల్ తీయడంతో ఈ ఇద్దరి మధ్య భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. కుల్దీప్ వేసిన 38వ ఓవర్లో కూడా హెడ్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. 38 ఓవర్లకు ఆసీస్.. 214 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 27 పరుగుల దూరంలో నిలిచింది.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ఆటగాడికి సంబంధించిన జట్టే విజేతగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అహ్మదాబాద్లో కూడా అదే సంప్రదాయం కొనసాగుతోందా..? అంటే అవుననే చెప్పక తప్పదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీకి ముందు ఆరు శతకాలు నమోదయ్యాయి. ఇందులో 1975లో క్లైవ్ లాయిడ్, 1979లో వివిన్ రిచర్డ్స్, 1996లో అరవింద డిసిల్వ, 1999లో ఆడమ్ గిల్క్రిస్ట్, 2003లో రికీ పాంటింగ్ లు సెంచరీలు చేసి వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సైడ్ నిలిచారు. కానీ 2011లో లంక బ్యాటర్ మహేళ జయవర్దెనే సెంచరీ చేసినా ఆ జట్టు ఓడిపోయింది. ఇక ఇప్పుడు ట్రావిస్ హెడ్ కూడా సెంచరీ చేసి ఆసీస్ను విజేతగా నిలిపేందుకు కొద్దిపరుగుల దూరంలోనే ఉన్నాడు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆసీస్ ఆరోసారి వన్డే ప్రపంచకప్ ముద్దాడేందుకు సిద్ధమవుతోంది. 35 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్.. మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 15 ఓవర్లలో 49 పరుగులు కావాలి. హెడ్ (107), లబూషేన్ (41)లు క్రీజులో ఉన్నారు.
ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేశాడు. 241 పరుగుల ఛేదనలో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన హెడ్.. 95 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. అతడి ఇన్నింగ్స్లో 14 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి.
A World Cup 💯 to savour for Travis Head!!
What a knock under pressure in a final. Australia are firm favourites now #WorldCupFinal pic.twitter.com/kteeDmckwv
— Cricbuzz (@cricbuzz) November 19, 2023
‘వరల్డ్ కప్ ఫైనల్లో అభిమానులంతా భారత్కే సపోర్ట్ చేస్తారని తెలుసు. కానీ మేం రేపు వాళ్లందరీ నోళ్లు మూయిస్తాం. ఒక క్రీడలో అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్ల అభిమానుల నోళ్లు మూయగలగడం కంటే ఆనందం ఇంకేం ఉంటుంది..?’ ప్రపంచకప్ ఫైనల్కు ముందురోజు నిర్వహించిన ఆసీస్ సారథి పాట్ కమిన్స్ అన్న మాటలివి. ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలో ఇటువంటి నిశ్శబ్దమే కనిపిస్తోంది. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు సుమారు లక్షా ఇరవై వేల మంది హాజరైనా సందడి మాత్రం లేదు. మోత మోగిపోతుందనుకున్న మోతేరా మూగబోతోంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరిన భారత్.. తుదిపోరులో తడబడి కప్పును కోల్పోయే దశకు చేరుతోంది. బ్యాటర్ల వైఫల్యంతో 240 పరుగులకే పరిమితమైన టీమిండియా.. ఆ తర్వాత ఆరంభ ఓవర్లలో ఆసీస్ను కట్టడిచేసినా ఆ జోరును కొనసాగించలేకపోతోంది. ఈ ఏడాది ది ఓవల్ వేదికగా ఆసీస్తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సెంచరీ చేసి భారత్కు గద దూరం చేసిన ట్రావిస్ హెడ్.. మరోసారి భారత పాలిట విలన్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటికే అతడు 85 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకొస్తున్నాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి కావాల్సింది 21 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే.. ఈ దశలో భారత్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతానికి మించిన అద్భుతం జరగాల్సిందే.
ఆరంభంలో తడబడ్డా ఆ తర్వాత కుదురుకున్న ఆసీస్ లక్ష్యానికి చేరువవుతోంది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఆసీస్ ఇదివరకే సగం టార్గెట్ను ఊదేసింది. 25 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (65) గేర్ మార్చి జోరు పెంచగా మార్నస్ లబూషేన్ (27) అతడికి తోడ్పాటునందిస్తున్నాడు. ఆరో ప్రపంచకప్ అందుకోవడానికి ఆ జట్టు మరో వంద పరుగుల దూరంలో ఉంది.
ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 22వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ చేశాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్లో కూడా హెడ్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 22 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్.. 3 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి కావాల్సింది 28 ఓవర్లలో 122 పరుగులే..
స్వల్ప లక్ష్య ఛేదనలో భాగంగా ప్రారంభంలో తడబడినా ఆ తర్వాత ఆసీస్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతోంది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసింది. కుల్దీప్ వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి హెడ్ సింగిల్ తీయడం ద్వారా ఆసీస్ వంద పరుగుల మార్కును కూడా దాటింది. 14 ఓవర్లుగా భారత్ వికెట్ కోసం ఎదురుచూస్తున్నా మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్ లు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. హెడ్ (44 ) అర్థ సెంచరీకి దగ్గరవుతుండగా లబూషేన్ (17) అతడికి సాయం అందిస్తున్నాడు.
భారత్ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఆసీస్ 17 ఓవర్లు ముగిసేసరికి 93 పరుగులు చేస్తే ఇందులో 17 పరుగులు ఎక్స్ట్రాల రూపంలోనే వచ్చాయి. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా చేసిందే తక్కువ పరుగులంటే ఆ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత్ బైస్ రూపంలో చాలా పరుగులిస్తోంది. ఆస్ట్రేలియా.. 50 ఓవర్లలో 12 పరుగులే ఎక్స్ట్రాల రూపంలో వేస్తే మనం సగం ఇన్నింగ్స్ కూడా కాకముందే 17 పరుగులిచ్చాం.
ఆరంభంలోనే త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ కోలుకుంటున్నది. ఓపెనర్గా వచ్చిన ట్రావిస్ హెడ్.. ఆసీస్ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్తపడుతున్నాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో ఐదో బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా 84 మీటర్ల సిక్సర్ బాదిన హెడ్.. సిరాజ్ వేసిన 17వ ఓవర్లో నాలుగో బంతికి బౌండరీ సాధించాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. హెడ్ (40), లబూషేన్ (10) క్రీజులో ఉన్నారు.
భారత పేస్ ద్వయం బుమ్రా, షమీలు ఇచ్చిన అద్భుత ఆరంభంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టిన భారత్.. ఆ తర్వాత స్పిన్నర్లను బరిలోకి దించింది. 11వ ఓవర్లో రోహిత్.. బంతిని జడ్డూకు అందించాడు. ఆ ఓవర్లో ఐదు పరుగులు రాగా మరుసటి ఓవర్లో కుల్దీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. జడ్డూనే వేసిన 13వ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. 13 ఓవర్లకు ఆసీస్.. 70 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (23), మార్నస్ లబూషేన్ (4) ఆడుతున్నారు.
వన్డే వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు, వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఇద్దరూ భారత్ నుంచే ఉన్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోహ్లీ.. 63 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తద్వారా ఈ ప్రపంచకప్లో మొత్తంగా అతడి పరుగులు 765కు చేరింది. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో ఇన్ని పరుగులు చేసిన క్రికెటర్ అతడు మాత్రమే. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నది కూడా టీమిండియా సారథి రోహిత్ శర్మనే. హిట్మ్యాన్.. 11 మ్యాచ్లలో 597 పరుగులు చేశాడు. ఇక వికెట్ల వీరుల జాబితాలో కూడా షమీనే అగ్రస్థానంలో ఉన్నాడు. షమీ.. ఏడు మ్యాచ్లలో 24 వికెట్లు తీస్తే రెండో స్థానంలో ఉన్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 11 మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టాడు.
VIRAT KOHLI FINISHES AS THE HIGHEST RUN SCORER OF THE WORLD CUP...!!!! pic.twitter.com/SSuf6vdgcb
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
Early wicket feels 🔥🔥
24 wickets & counting for Shami as he now becomes the leading wicket-taker in #CWC23 🔝
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/bKjHu2DQd7
— BCCI (@BCCI) November 19, 2023
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు శక్తికి మించి పోరాడుతున్నారు. ఆస్ట్రేలియాను కుదురుకోకుండా చేస్తున్నారు. తొలి నాలుగు ఓవర్లలోనే నలభై పరుగులు చేసిన ఆసీస్.. ఆ తర్వాత నెమ్మదించింది. ఐదో ఓవర్లో మార్ష్ వికెట్ తీయడంతో పాటు మెయిడిన్ వేసిన బుమ్రా.. అదే రిథమ్ను మెయింటెన్ చేస్తున్నాడు. షమీ కూడా ఆరో ఓవర్లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. తన మరుసటి ఓవర్లో బుమ్రా.. వికెట్ తీయడమే గాక ఐదు పరుగులే ఇచ్చాడు. షమీ 8వ ఓవర్ మెయిడిన్ వేయగా 9వ ఓవర్లో బుమ్రా.. నాలుగు పరుగులే ఇచ్చాడు. అవి కూడా బైస్ రూపంలోనే వచ్చాయి. 9 ఓవర్లకు ఆసీస్ 51 పరుగులు చేసింది. అయితే షమీ వేసిన పదో ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదడంతో పది పరుగులు వచ్చాయి. పది ఓవర్లు ముగిసేటప్పటికీ ఆసీస్.. మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.
ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. బుమ్రా వేసిన ఏడో ఓవర్లో ఆఖరి బంతికి స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఏడు ఓవర్లకు ఆసీస్.. మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
LBW!
And Jasprit Bumrah has another 🔥🔥
Steve Smith departs and Australia are 3 down!
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/LrrYpqs0UR
— BCCI (@BCCI) November 19, 2023
241 పరుగుల ఛేదనలో ఆసీస్ కూడా తడబడుతోంది. ఆ జట్టు రెండో వికెట్ కూడా కోల్పోయింది. 15 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్ సాయంతో మ 15 పరుగులు చేసిన మార్ష్.. బుమ్రా వేసిన ఐదో ఓవర్లో మూడో బంతికి వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ చేతికి చిక్కాడు.
BOOM! 💥
Mitchell Marsh is caught behind as Jasprit Bumrah strikes!
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/hu0er3xThe
— BCCI (@BCCI) November 19, 2023
షమీ వేసిన రెండో ఓవర్లో ఆసీస్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన మిచెల్ మార్ష్ కూడా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. తాను ఎదుర్కున్న రెండో బంతికే కవర్ పాయింట్ మీదుగా ఫోర్ కొట్టిన మార్ష్.. షమీనే వేసిన నాలుగో ఓవర్లో లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్.. ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. మార్ష్ (15), హెడ్ ( 8) క్రీజులో ఉన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ భారత్కు తొలి బ్రేకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ.. డేవిడ్ వార్నర్ (7)ను ఔట్ చేశాడు. ఆఫ్స్టంప్కు ఆవలగా వెళ్తున్న బంతిని టచ్ చేయబోయిన వార్నర్.. ఫస్ట్ స్లిప్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ వరల్డ్ కప్లో షమీకి ఇది 24వ వికెట్. వరల్డ్ కప్-2023లో అత్యధిక వికెట్ల వీరులలో షమీదే అగ్రస్థానం.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు నిర్దేశించిన 241 పరుగులతో బరిలోకి దిగిన ఆసీస్.. ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్లు ఓపెనర్లుగా వచ్చి ఆసీస్ ఛేదనను మొదలుపెట్టారు. తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో.. హెడ్ రెండు బౌండరీలు కొట్టగా వార్నర్ ఒక ఫోర్ కొట్టాడు.
అహ్మదాబాద్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను అలరించాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఆధ్వర్యంలో గాయకులు బాలీవుడ్ పాటలతో అలరించారు. నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, తుషార్ జోషి, జోనితా గాంధీలు తమ పాటలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించారు.
Closing ceremony at the Narendra Modi Stadium. pic.twitter.com/u8zrgp9P9d
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
CLOSING CEREMONY LIVE ON STAR SPORTS. pic.twitter.com/cvYrHELDLP
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు తొలుత బ్యాటింగ్కు వచ్చి దారుణంగా విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 240 పరుగులకే ఆలౌట్ అయింది. కెఎల్ రాహుల్ (107 బంతుల్లో 66, 1 ఫోర్), విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 54, 4 ఫోర్లు), రోహిత్ శర్మ (31 బంతుల్లో 47, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడమే గాక మిడిల్ ఓవర్స్లో పరుగుల కట్టడి చేసి భారత్ను పరుగులు చేయకుండా నిలువరించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా హెజిల్వుడ్, కమిన్స్ లు తలా రెండు వికెఓట్లు పడగొట్టారు. మ్యాక్స్వెల్, జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 241 పరుగులు చేయాల్సి ఉంది. భారత్.. పది వికెట్లు తీయగలిగితే 12 సంవత్సరాల తర్వాత మరో వన్డే ప్రపంచకప్ గెలిచి మూడోసారి విశ్వవిజేతగా నిలువనుంది. మరి భారత బౌలర్లు ఏం మాయ చేస్తారో తెలియాలంటే మరికొద్దిసేపు వేచి చూడాల్సిందే..
A fight until the end ✊ For one last time this #CWC, let’s go #TeamIndia! 🇮🇳 pic.twitter.com/3sKBaiO0lM
— SunRisers Hyderabad (@SunRisers) November 19, 2023
వన్డే వరల్డ్ కప్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి బ్యాటింగ్కు వచ్చాడు. గత పది మ్యాచ్లలో భారత టాపార్డర్, మిడిలార్డర్ రాణించడంతో భారత్లో ఏడో స్థానంలో వచ్చే జడేజాకూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఫైనల్లో మాత్రం భారత బ్యాటర్ల వైఫల్యంతో ఆఖరి స్థానంలోవచ్చే సిరాజ్ కూడా బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది.
కనీసం 250 అయినా టార్గెట్ ఇవ్వాలని భావిస్తున్న భారత్ 240 కూడా చేసేది అనుమానంగానే ఉంది. 28 బంతులాడిన సూర్యకుమార్ యాదవ్.. హెజిల్వుడ్ వేసిన 47.3 ఓవర్లో ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చాడు. 47.3 ఓవర్లకు భారత స్కోరు 226/9గా ఉంది.
ఆసీస్తో ఫైనల్ పోరులో కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిలపడంలో విఫలమైన టీమిండియా కనీసం పోరాడే టార్గెట్ను అందించేందుకు ఇక నాలుగు ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. 46 ఓవర్లకు భారత్.. 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఎట్టకేలకు ఓ వికెట్ తీశాడు. పదో ఓవర్ వేస్తున్న జంపా.. ఐదో బంతికి బుమ్రాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఆఖరి ఓవర్లలో భారత్ మరింత తడబడుతోంది. కెఎల్ రాహుల్ ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ (6) కూడా ఔటయ్యాడు. స్టార్క్ వేసిన 44వ ఓవర్లో నాలుగో బంతికి షమీ.. వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చాడు. 44 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (13), బుమ్రా (1)లు క్రీజులో ఉన్నారు.
అహ్మదాబాద్లో ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని అయినా ఇచ్చేందుకు భారత్కు ఉన్న ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. రాహుల్ను 42వ ఓవర్లో మూడో బంతికి జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ఇచ్చాడు. 107 బంతులు ఆడిన రాహుల్.. ఒక బౌండరీ సాయంతో 66 పరుగులు చేశాడు. రాహుల్ ఔట్ అవడంతో షమీ క్రీజులోకి వచ్చాడు. 42 ఓవర్లకు భారత స్కోరు.. ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులుగా ఉంది.
భారత స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. హిట్మ్యాన్ దూకుడుతో 6.3 ఓవర్లకే 50 పరుగులు చేసిన భారత్.. పది ఓవర్లకే 80 పరుగులు చేయగలిగింది. కానీ రోహిత్ ఔట్ అయ్యాక స్కోరువేగం తగ్గింది. 16.4 ఓవర్లకు భారత స్కోరు వంద పరుగులకు చేరగా ఆ తర్వాత వవంద పరుగులు చేయడానికి భారత్ ఏకంగా 33.2 ఓవర్ల పాటు ఆగాల్సి వచ్చింది.
40 ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఇండియాకు ఇంకా పది ఓవర్లకు మాత్రమే మిగిలున్నాయి. కెఎల్ రాహుల్ (102 బంతుల్లో 64), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 8) లు క్రీజులో ఉన్నా ఇంకా బ్యాట్కు పని చెప్పడం లేదు. ఆసీస్ బౌలర్లు కట్టడి చేస్తుండటంతో భారత్కు పరుగుల రాకే గగనమమవుతోంది.
జోష్ హెజిల్వుడ్ వేసిన 36వ ఓవర్లో ఐదో బంతికి రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) ఔట్ అయ్యాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతికి ఆసీస్ రివ్యూ కోరగా బతికిపోయిన జడ్డూ.. మరుసటి బంతికి వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జడ్డూ నిష్క్రమణతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 36 ఓవర్లకు భారత్.. ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
కెఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తిచేశాడు. 86 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి కోహ్లీతో విలువైన 87 పరుగులను జోడించిన రాహుల్.. భారత ఇన్నింగ్స్ను తన భుజాలపై వేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో ఇంకా 14 ఓవర్లే మిగిలుండటంతో అతడు గేర్ మార్చే అవకాశముంది.
1⃣7⃣th ODI FIFTY for KL Rahul! 👏 👏
This has been a solid knock in the #CWC23 #Final! 💪 💪
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #MenInBlue | #INDvAUS | @klrahul pic.twitter.com/MQHeIiG3L4
— BCCI (@BCCI) November 19, 2023
అహ్మదాబాద్లో భారత ఇన్నింగ్స్ నత్తకు నడక నేర్పినట్టుగా సాగుతోంది. కోహ్లీ – రాహుల్ లు నాలుగో వికెట్కు 87 పరుగుల జోడించిన తర్వాత విరాట్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నాడు. కెఎల్ రాహుల్.. మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడుతుండటంతో భారత్ స్కోరు వేగం కదలడం లేదు. 34 ఓవర్లకు భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. రాహుల్ (48), జడేజా (7)లు క్రీజులో న్నారు.
30 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోహ్లీ నిష్క్రమణతో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. కెఎల్ రాహుల్ (39) అర్థ సెంచరీకి చేరువవుతున్నాడు. ఈ ఇద్దరి తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఈ మ్యాచ్లో భారత్ పోరాడే లక్ష్యాన్ని నిలపాలన్నా మిగిలున్నది 20 ఓవర్లే. మరి ఈ ఆటతో భారత్.. 260 పరుగులైనా చేయగలుగుతుందా..?
వరల్డ్ కప్ ఫైనల్ చూస్తున్న 140 కోట్ల భారత అభిమానులకు భారీ షాక్. అర్థ సెంచరీ పూర్తిచేసుకుని క్రీజులో నిలదొక్కుకున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. కమిన్స్ వేసిన 29వ ఓవర్లో మూడో బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని ఆడబోగా అదికాస్తా బ్యాట్కు స్టంప్స్ను ఎగురగొట్టింది. అంతే ఇప్పటిదాకా మోతెక్కిన మోతారా నోరు మూగబోయింది..
Pin drop SILENCE in the Narendra Modi Stadium. 🤐
Pat Cummins gets Virat Kohli, this is MASSIVE for Australia! 💪 pic.twitter.com/CIthDPGQxS
— Sky Sports Cricket (@SkyCricket) November 19, 2023
అహ్మదాబాద్లో ఇన్నింగ్స్ను దాటిగా మొదలుపెట్టిన భారత్.. రోహిత్ ఔటయ్యాక ఎట్టకేలకు 97 బంతుల తర్వాత బౌండరీ సాధించింది. పదో ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ వేసిన ఆఖరి బంతికి బౌండరీ రాగా ఆ తర్వాత మళ్లీ అదే మ్యాక్సీ వేసిన 27వ ఓవర్లో రెండో బంతికి కెఎల్ రాహుల్ బౌండరీ సాధించాడు. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.
It took 97 balls, but India FINALLY get a boundary during the middle overs!https://t.co/uGuYjoOWie #CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/Gn1Dr7uhWG
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2023
గిల్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చి రోహిత్తో కలిసి దూకుడుగా ఆడిన విరాట్.. ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో నెమ్మదించాడు. కెఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్కు ఇరుసులా మారుతున్న కోహ్లీ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ మెగా టోర్నీలో కోహ్లీకి ఇది ఏడో అర్థ సెంచరీ. కెఎల్ కూడా క్రీజులో కుదురుకుంటున్నాడు. 25.1 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్.. మూడు వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. కోహ్లీ (50), కెఎల్ రాహుల్ (25) క్రీజులో ఉన్నారు.
The Kohli juggernaut rolls on! 🇮🇳#AavaDe | #INDvAUS | #CWC23 | #WorldCupKeTitans pic.twitter.com/puo0vtZ44k
— Gujarat Titans (@gujarat_titans) November 19, 2023
భారత ఇన్నింగ్స్ను పునర్నిర్మించే పనిలో పడ్డ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్లు ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడుతున్నారు. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతుండటంతో భారత స్కోరు వేగం కూడా తగ్గింది. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ సారథి పాట్ కమిన్స్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నా కోహ్లీ – రాహుల్ ధ్వయం మాత్రం ఆ అవకాశమివ్వడంలేదు. మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఈ ఓవర్ పూర్తయ్యేసరికి భారత్.. మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ – ఆసీస్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సాధారణ అభిమానులే గాక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా హాజరయ్యాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసూదేవ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, గానకోకిల ఆషాబోష్లే, టాలీవుడ్ వెటరన్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ కూడా అహ్మదాబాద్లో మెన్ ఇన్ బ్లూకు మద్దతుగా హాజరయ్యారు.
SHAHRUKH KHAN AT NARENDRA MODI STADIUM. pic.twitter.com/tIM2W6ZxAM
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
The biggest supporters of Indian players in Narendra Modi Stadium. pic.twitter.com/sOvPlBLige
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
Salman Khan & Katrina Kaif at Narendra Modi Stadium using hologram technology in Star Sports. pic.twitter.com/S1TKugZifu
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నీలి సంద్రమైంది. టీమిండియా జెర్సీ కలర్ (బ్లూ)తో నరేంద్ర మోడీ స్టేడియం నీలి సముద్రంలా కనిపిస్తోంది. ఈ మ్యాచ్కు ఇప్పటివరకే లక్షా 25వేల మంది హాజరైనట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
This is madness at Narendra Modi Stadium. 🇮🇳
- Video of the day. 🫡pic.twitter.com/hHfYjoK8VH
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
రోహిత్ ఎదురుదాడితో భారత ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభమైనా తర్వాత మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడింది. పవర్ ప్లే ముగియడంతో పాటు విరాట్ – రాహుల్లు సింగిల్స్ మీదే దృష్టి సారించడంతో భారత్ స్కోరు వేగం తగ్గింది. గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి బౌండరీ రాగా ఆ తర్వాత 53 బంతులైనా బాల్ మళ్లీ బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లలేదు. 19 ఓవర్లు ముగిసేసరికి భారత్.. మూడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. పది ఓవర్లకు 80 పరుగులు చేసిన భారత్.. తర్వాత 9 ఓవర్లలో 33 పరుగులే చేసింది.
రోహిత్, కోహ్లీ దూకుడైన బ్యాటింగ్తో టీమిండియా మూడంకెల స్కోరును దాటిది. జంపా వేసిన 16వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ సింగిల్ తీయడం ద్వారా భారత్ స్కోరు వంద పరుగులు దాటింది. 16 ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. డ్రింక్స్ విరామానికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (34)లు క్రీజులో ఉన్నారు.
15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (32), కెఎల్ రాహుల్ (8) క్రీజులో ఉన్నారు.
వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్లో 31 బంతుల్లోనే నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసిన హిట్మ్యాన్.. సింగిల్ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు (597) చేసిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డును అధిగమించాడు. 2019 వరల్డ్ కప్లో కేన్ మామ.. 578 పరుగులు సాధించాడు. అంతకుముందు మహేళ జయవర్దెనే (శ్రీలంక) 2007లో 548 పరుగులు చేశాడు. భారత్ నుంచి సౌరవ్ గంగూలీ.. 2003 ఎడిషన్లో 465 పరుగులు చేశాడు.
Rohit Sharma now has most runs by a captain in a single edition in world cup 🔥🔥@ImRo45 pic.twitter.com/cGV08lQFzp
— Rohit Sharma Trends™ (@TrendsRohit) November 19, 2023
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను దాటిగా ఆరంభించిన భారత్కు బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో డబుల్ స్ట్రోక్లు తాకాయి. రోహిత్, శ్రేయస్ నిష్క్రమణతో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన శ్రేయస్.. ఫైనల్లో ఒత్తిడికి చిత్తయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ (26), కెఎల్ రాహుల్ (4)లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇన్నింగ్స్ నిర్మిస్తేనే భారత్ భారీ స్కోరుపై ఆశలుంటాయి.
Full Hope Only on this Man @imVkohli ♥️#INDvsAUSfinal #Worldcupfinal2023 #CWC23Final #INDvsAUS #INDvAUS pic.twitter.com/jKzs65lQCY
— Vishnu Mathur (@vishnumathur99) November 19, 2023
అహ్మదాబాద్లో భారత్కు వరుసగా షాకులు తాకుతున్నాయి. రోహిత్ ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) కూడా ఔటయ్యాడు. మూడు బంతులే ఎదుర్కున్న అయ్యర్.. పాట్ కమిన్స్ 11 వ ఓవర్లో రెండో బంతికి వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మ్యాక్స్వెల్ వేసిన పదో ఓవర్లో రెండో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్గా మలిచిన రోహిత్ శర్మ, మూడో బంతిని బౌండరీగా తరలించాడు. కానీ నాలుగో బంతిని మరో షాట్ ఆడబోయి ట్రావిస్ హెడ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఫలితంగా భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 31 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (23), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజులో ఉన్నారు.
స్టార్క్, హెజిల్వుడ్ల బౌలింగ్లో రోకో (రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ) ధ్వయం ధాటిగా ఆడుతుండటంతో ఆసీస్ సారథి 8వ ఓవర్లోనే పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్ చేతికి బంతినిచ్చాడు. ఈ ఓవర్లో కోహ్లీ.. కవర్ పాయింట్ మీదుగా బౌంరీ సాధించాడు. తొమ్మిది ఓవర్లకు భారత స్కోరు వికెట్ నష్టపోయి 66 పరుగులుగా ఉంది.
గిల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రన్ మిషీన్ విరాట్ కోహ్లీ పరుగుల వేట మొదలెట్టాడు. స్టార్క్ వేసిన ఏడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. రోహిత్ కూడా బాదుతుండటంతో టీమిండియా స్కోరు దూసుకుపోతోంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. రోహిత్ (33), కోహ్లీ (16) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ శుభ్మన్ గిల్(4) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నేరుగా ఆడం జంపాకు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ(25) ఆడుతున్నాడు.