హుజూర్నగర్, మే 30 : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అనాథలు చేయొద్దని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న గుంజ తిరుపతయ్య, సుబ్బమ్మ దంపతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతయ్య రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవాడని, రెండు సంవత్సరాలుగా రిక్షా తొక్కలేక దాతల సహకారంతో కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నాడని తెలిపారు. శనివారం ట్విట్టర్లో వీరి ధీనగాథను రాష్ట్ర అధికారుదృష్టికి వెళ్లగా వారి ఆదేశాలతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. వారిని బరాఖత్గూడెం వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని చెప్పగా, రెండ్రోజుల తర్వాత అక్కడి వెళ్తామని వారు చెప్పడంతో రెండ్రోజులకు కావాల్సిన ఆహార పదార్థాలను ఐసీడీఎస్ సిబ్బంది అందజేస్తారని తెలిపారు. వారికి అంగన్వాడీ టీచర్లు చిలకబత్తిని శాంత, పొనుగుపాటి సరళ దుప్పట్లు, చీరలు అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు రేణుక, శాంతారాజ్యం, మాలతి పాల్గొన్నారు.