Women’s World Boxing Championship | మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం దక్కింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ బంగారు పతకాన్ని సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మ్యాచ్ జరిగింది. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్తో తలపడింది. ఈ మ్యాచ్లో 5-2 తేడాతో మట్టికరిపించింది. మహిళ బాక్సింగ్ ప్రపంచకప్లో భారత్కు ఇది నాలుగో స్వర్ణ పతకం. ఇవాళ జరిగిన 50 కేజీల ఫైన్ విభాగంలో 5-0తేడా నిఖత్ జరీన్ వరుస రెండో టైటిల్ను సాదించింది. మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ టైటిళ్లను సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్గా నిలిచింది. అలాగే శనివారం జరిగిన మ్యాచుల్లో నీతూ ఘంఘాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) స్వర్ణాలు సాధించిన విషయం తెలిసిందే.