Womens T20 WC : సెమీస్ బెర్తుకు ముందు కీలకమైన మ్యాచ్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ (24) స్వల్ప స్కోర్కే ఔట్ అయింది. డెలానీ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకుంది. దాంతో, 62 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన (33), హర్మన్ప్రీత్ కౌర్ (1) క్రీజులో ఉన్నారు. షఫాలీ, మంధాన ప్రతి ఓవర్లో బౌండరీ కొడుతూ సింగిల్స్, డబుల్స్ తీశారు. ఐర్లాండ్ బౌలర్లు జార్జినా డెంప్సే, ఒర్లా ప్రెండెర్గాస్ట్, అరియెనె కెల్లీ కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో షఫాలీ, మంధాన భారీ షాట్లు ఆడలేకపోయారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్.. 63/1.
టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. కీలకమైన పోరు కోసం భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. రాధా యాదవ్ ప్లేస్లో దేవికా యాదవ్ జట్టులోకి వచ్చింది.