Womens T20 WC : భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చెలరేగడంతో పది పరుగులకే ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. మూడో ఓవర్లో రేణుకా సింగ్, అలిసే కాప్సేను బౌల్డ్ చేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రేణుక సింగ్ ఇంగ్లండ్కు షాకిచ్చింది. ఓపెనర్ వ్యాట్ను ఔట్ చేసింది. వ్యాట్ ఇచ్చిన క్యాచ్ను రీచా ఘోష్ అద్భుతంగా అందుకుంది. దాంతో ఇంగ్లండ్ ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సోఫియా డంక్లే (10), నాట్ సీవర్ బ్రంట్ (5) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్.. 19/2.
భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా ఠాకూర్ సింగ్, షఫాలీ వర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.
ఇంగ్లండ్ జట్టు: నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కీవర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్, సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్.