న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ అనంతరం నెల రోజుల పాటు లీగ్ నిర్వహించాలని బోర్డు యోచిస్తున్నది.
‘మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతుంది. తొలి ఏడాది నెల రోజుల పాటు మ్యాచ్లు జరుగుతాయి’ అని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతానికి ఐదు జట్లతో లీగ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నా.. స్పా న్సర్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో టీమ్ల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.