క్రికెట్పై మరోసారి కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. సౌతాఫ్రికాలో బయటపడిన కొత్త కరోనా వేరియంట్ I( omicron ) చూసి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది.
కరోనా భయంతో జింబాబ్వేలో జరగాల్సిన ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ రద్దు చేసింది. 2021 మహిళల ప్రపంచకప్లో క్వాలిఫైయర్స్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే కరోనా రిస్క్ ఉండటంతో వీటిని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
The ongoing ICC Women's Cricket World Cup Qualifier 2021 in Zimbabwe has been abandoned with immediate effect due to #COVID19 risk: ICC pic.twitter.com/bczApQGZ3P
— ANI (@ANI) November 27, 2021