న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ మ్యాచ్లకు తొలిసారి మహిళా అంపైర్లు విధులు నిర్వహించనున్నారు. డిసెంబర్ 13 నుంచి ఆరంభం కానున్న రంజీ సీజన్లో వృందా రాఠి, జనని నారాయణన్, గాయత్రి వేణుగోపాలన్ అంపైర్లుగా వ్యవహరించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. భారత క్రికెట్ చరిత్రలో పురుషుల మ్యాచ్లకు మహిళలు అంపైర్లుగా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. గతంలో గాయత్రి ఒక రంజీ మ్యాచ్కు నాలుగో అంపైర్గా వ్యవహరించారు. బీసీసీఐతో రిజిస్టర్ అయిన 150 మంది అంపైర్లలో ఈ ముగ్గురే మహిళా అంపైర్లు కావడం గమనార్హం. వీరికి కొన్ని రంజీ మ్యాచ్లలో అంపైర్లుగా అవకాశం కల్పించనున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.