SA20 League : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. లీగ్ దశలో అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. స్టేడియానికొచ్చిన అభిమానులు కూడా మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం న్యూలాండ్స్(Newlands) స్టేడియంలో ఎంఐ కేప్టౌన్(MI Cape Town), పార్ల్ రాయల్స్(Paarl Royals) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఒక మహిళ బీరు గ్లాసుతో కెమెరా కంట పడింది.
దాంతో, పెద్ద స్క్రీన్ మీద ఆమెను చూపించారు. అయినా కూడా మొహమాట పడకుండా ఎత్తిన బీరు గ్లాస్ దించకుండా గడగడా తాగింది. ఆ కాసేటికే తన పక్కనే కూర్చున్న ఆమె తండ్రి బీరు కూడా స్వాహా అనిపించింది. దాంతో, ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. కామెటరీ బాక్స్లో ఉన్న కెవిన్ పీటర్సన్ ఆ మహిళను లెజెండ్ అంటూ పొగిడేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
What a hero!!! 😂 #MICTvPR #SA20 #MICapeTown
🎥 @SkyCricket pic.twitter.com/PvWMpH4vZr
— Danny Culley (@DannyCulley1) January 19, 2024
ఎంపై కేప్టైన్, పార్ల్ రాయల్స్ మధ్య జరిగిన 11వ లీగ్ మ్యాచ్లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాయల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రియన్ రికెల్టన్(91) అర్ధ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్ రసీ వాన్ డస్సెన్(41) దంచి కొట్టాడు. దాంతో, ముంబై 16.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది.