జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో టాలన్స్ 40-38తో ఉత్తరప్రదేశ్ గోల్డెన్ ఈగల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ఆదిలో కొంత నెమ్మదించిన టాలన్స్ ప్రథమార్థం ఆఖర్లో పుంజుకుంది. కీలక ప్లేయర్లు దేవిందర్సింగ్, అనిల్, రఘు చెలరేగడంతో టాలన్స్ అద్భుత విజయం ఖాతాలో వేసుకుంది.