ఓస్బౌర్న్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి టీ20లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట లంక 4 వికెట్లకు 131 పరుగులు చేసింది. చండీమల్ (54 నాటౌట్), అషెన్ భండార (44 నాటౌట్) రాణించారు. లక్ష్యఛేదనలో సిమన్స్ (26), లూయిస్ (21), పూరన్ (23), అలెన్ (21 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేయడంతో విండీస్ 19 ఓవర్లలో 134 పరుగులు చేసింది.