వెల్లింగ్టన్ : కేన్ విలియమ్సన్తోపాటు నలుగురు ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడేందుకు క్రికెట్ న్యూజిలాండ్ అనుమతించింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్నుంచి వారికి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్), టిమ్ సౌథీ (కోల్కతా నైట్రైడర్స్), డెవాన్ కాన్వే(చెన్నై సూపర్కింగ్స్), మిచెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) ఐపీఎల్లో ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా మరో ముగ్గురు ఆటగాళ్లు ఫిన్ అలెన్, లోకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్కు తొలి వన్డే అనంతరం ఐపీఎల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. న్యూజిలాండ్-శ్రీలంక మధ్య ఈనెల 25న తొలి వన్డే జరుగనుండగా, ఐపీఎల్ మార్చి 31న ఆరంభం కానున్నది.