ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న భారత ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. మరో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సత్తాచాటుతూ డొమెస్టిక్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. షా, పడిక్కల్ ఇద్దరూ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల సాధిస్తున్నారు. ప్రస్తుతం యువ ఆటగాళ్లిద్దరూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఐతే త్వరలో ఇంగ్లాండ్ జరగబోయే వన్డే సిరీస్కు ఎంపికవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే సిరీస్లో కుర్రాలిద్దరికీ అవకాశం లభించదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. టీమ్ఇండియాకు బలమైన రిజర్వ్ బెంచ్ ఉండటంతో కొత్త ఆటగాళ్లకు ఇప్పట్లో అవకాశాలు దక్కడం కష్టమే. ఒక్కో స్థానానికి కనీసం ఇద్దరు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. పృథ్వీ షా, పడిక్కల్ వన్డే సిరీస్కు ఎంపిక అవుతారా? అనే చర్చ సోషల్మీడియాలో జరుగుతోంది.