INDvsAUS Final: భారత్-ఆసీస్ మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ ఫైనల్కు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక పోరులో భారత తుది జట్టు ఎలా ఉండనుంది..? అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్డేడియంలో మందకొడి పిచ్ తయారుచేశారని, స్పిన్కు అనుకూలించే అవకాశాలు ఎక్కువున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ టీమిండియా తుది జట్టులో ఒక పేసర్ను తప్పించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఆడిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ స్పందించాడు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫెరెన్స్లో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచకప్లో మేం ఎంపిక చేసిన 15 మందిలో అందరికీ ఆడే అవకాశాలిస్తున్నాం. మేం ఇవాళ, రేపు పిచ్ను అంచనా వేసిన తర్వాత తుది జట్టుపై అంచనాకి వస్తాం. తుది జట్టులో ఉండటానికి 12-13 మంది అయితే రెడీగా ఉన్నా మ్యాచ్లో బరిలోకి దిగేది 11 మందే కావున మాకు అందుబాటులో ఉన్న 15 మందిలో అందరూ అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నా..’ అని అన్నాడు. భారత్ – న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా ముగిసిన సెమీస్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. అహ్మదాబాద్లో అతడిని పక్కనబెట్టి అశ్విన్ను ఆడించనున్నారని చర్చలు సాగుతున్న నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.