భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన కైల్ మేయర్స్ (15) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో డెలివరీకి అర్షదీప్ షార్ట్ బాల్ వేశాడు. అది ఊహించని మేయర్స్ దాన్ని ఎలాగోలా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయి సులభమైన క్యాచ్ అందుకోవడంతో మేయర్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే జడేజా బౌలింగ్లో హోల్డర్ (0) కూడా అవుటయ్యాడు. జడేజా వేసిన బంతిని ఫీల్డర్ల మీదుగా కొట్టేందుకు హోల్డర్ వెనక్కు జరిగాడు. అయితే బంతి స్పిన్ అవడంతో దాన్ని అంచనా వేయలేకపోయాడు. దాంతో బ్యాటును తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. హోల్డర్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులతో నిలిచింది.