ఐదో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చిన లోఫుల్టాస్ను బౌలర్ తల మీదుగా బాదేందుకు శ్రేయాస్ ప్రయత్నించాడు.
కానీ దాన్ని సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో నేరుగా హోల్డర్ మీదకు బంతిని కొట్టాడు. హోల్డర్ సులభమైన క్యాచ్ అందుకోవడంతో శ్రేయాస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 122/3 స్కోరుతో నిలిచింది.
.@Jaseholder98 with the catch and dance! 🕺
#WIvIND | #INDvWI pic.twitter.com/rpQbXJqdcB— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) August 7, 2022