వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్కు షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఒబెడ్ మెకాయ్ దెబ్బతీశాడు. మ్యాచ్ తొలి బంతికే టీమిండియా సారధి రోహిత్ శర్మ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ఊహించని విధంగా బంతి బౌన్స్ అవడంతో దాన్ని ఎలాగోలా ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్ దిశగా గాల్లోకి లేచిన బంతిని హొస్సేన్ సులభంగా క్యాచ్ పట్టేశాడు. దాంతో తొలి బంతికే రోహిత్ పెవిలియన్ చేరాల్చి వచ్చింది.
ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) కూడా పెవిలియన్ చేరాడు. మెకాయ్ వేసిన బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన సూర్య విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ థామస్ సులభంగా అందుకోవడంతో సూర్యకుమార్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.