వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించినప్పటికీ.. పవర్ప్లే ముగిసేసరికి ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (21) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. అతనికి రిషభ్ పంత్ (25 నాటౌట్) కూడా మంచి సహకారం అందించాడు. 12వ ఓవర్లో గేరు మార్చేందుకు ప్రయత్నించిన హుడా.. కవర్స్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అల్జారీ జోసెఫ్ వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో నేరుగా కవర్స్లో ఉన్న బ్రాండన్ కింగ్కు క్యాచ్ ఇచ్చాడు.