వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ను అక్షర్ పటేల్ తుత్తునియలు చేశాడు. భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విండీస్ ముప్పుతిప్పలు పడుతోంది. తొలి ఓవర్లోనే జేసన్ హోల్డర్ (0) అవుటవగా.. ఆ తర్వాత వెంటనే మరో వికెట్ పడకుండా విండీస్ జాగ్రత్తపడింది. అయితే ఐదో ఓవర్లో మరోసారి బంతి అందుకున్న అక్షర్.. అదే ఓవర్లో షామ్రా బ్రూక్స్ (13), డెవాన్ థామస్ (10)ని పెవిలియన్ చేర్చి ఆ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో తొలి పవర్ప్లే ముగిసే సరికి వెస్టిండీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 38 పరుగులతో నిలిచింది. ఈ మూడు వికెట్లూ అక్షర్ ఖాతాలోనే పడటం గమనార్హం.
WI 38/3 (6) – End of power play @SHetmyer 14@nicholas_47 0#WIvIND #MenInMaroon
Live Scorecard⬇️https://t.co/EWmBMzc40i pic.twitter.com/Rvgw6ye1mH
— Windies Cricket (@windiescricket) August 7, 2022