షార్జా: టీ20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో విండీస్ బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు గెలవాలనే కసితో బరిలో దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టును మూడో ఓవర్లోనే ముస్తాఫిజుర్ రెహ్మాన్ దెబ్బతీశాడు.
ఫామ్లో ఉన్న ఎల్విన్ లూయిస్ (6)ను అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్గా వచ్చిన క్రిస్గేల్ (4) క్రీజులో ఉండటంతో ఫర్వాలేదని ఆ జట్టు భావించింది. కానీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అతన్ని మెహదీ హసన్ క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే షిమ్రాన్ హెట్మెయర్ (9) కూడా పెవిలియన్కు చేరాడు.
మెహదీ హసన్ బౌలింగ్లో భారీషాట్కు ప్రయత్నించిన అతను లాంగాఫ్లో సౌమ్య సర్కార్కు చిక్కాడు. దీంతో 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం రోస్టన్ ఛేజ్ (14 నాటౌట్), కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు.