రీఎంట్రీలో భారత్ తరఫున అద్భుతాలు చేస్తున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్పై ప్రశంసలు కురుస్తున్నాయి. వెస్టిండీస్తో తొలి టీ20లో అతడు చివర్లో వచ్చి వీర బాదుడు బాదడంతో భారత్ భారీ స్కోరు చేసింది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కార్తీక్.. కచ్చితంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ జట్టు ప్రాబబుల్స్లో ఉంటాడని సెలక్టర్లు చెబుతున్నారు.
వెస్టిండీస్పై తొలి టీ20లో దినేశ్ కార్తీక్ మెరుపుల తర్వాత ఇన్సైడ్ స్పోర్ట్స్.. కార్తీక్ టీ20 ప్రపంచకప్ సభ్యులలో ఉంటాడా అని అడిగిన ప్రశ్నకు సెలక్షన్ టీమ్లోని ఓ సభ్యుడు స్పందించాడు. ‘దినేశ్ కార్తీక్ను ఆపేదెవరు..? అతడు వచ్చే పొట్టి ప్రపంచకప్ ప్రాబబుల్స్లో కచ్చితంగా ఉంటాడు. నిలకడగా రాణిస్తున్న కార్తీక్కు అపార అనుభవమే ఇప్పుడు అతడి ఆస్తి..’ అని తెలిపాడు.
గతంలో కార్తీక్ సైతం తన లక్ష్యం టీ20 ప్రపంచకప్లో ఆడటమేనని, ఆమేరకు తాను కష్టపడుతున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్తో మ్యాచ్ అనంతరం అశ్విన్తో అతడు మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
ఇక శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కార్తీక్.. 19 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. అశ్విన్తో కలిసి చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు జోడించిన అతడు.. భారత్ 190 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
2 great friends, 1 good chat 🤝 👌
Presenting @ashwinravi99 & @DineshKarthik from Trinidad as the duo talk about each others’ career, dressing room atmosphere & the upcoming T20 World Cup. 👍 👍 – By @28anand
Full interview 🎥 🔽 #TeamIndia | #WIvIND https://t.co/o1Vv3lwTBl pic.twitter.com/yXMEv4N8x5
— BCCI (@BCCI) July 30, 2022